సినీ పరిశ్రమపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరోనా ఉద్ధృతి పెరుగుతున్నందున అవసరమైతే రాష్ట్రంలోనూ థియేటర్లపై ఆంక్షలు తప్పవని తలసాని స్పష్టం చేశారు. అయితే తమ ప్రభుత్వం సినీ రంగంపై ఎలాంటి బలవంతపు నిర్ణయాలు తీసుకోదని వెల్లడించారు. అఖండ, పుష్ప చిత్రాలతో సినీ పరిశ్రమ పుంజుకుందని ఆనందం వ్యక్తం చేసిన తలసాని... సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణలో టికెట్ ధరలు పెంచామని, ఐదో ఆటకు అనుమతి ఇచ్చామని తలసాని పునరుద్ఘాటించారు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్న తలసాని...సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్ గా ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్షని అని తెలిపారు
సినిమాకు కులం మతం ప్రాంతాలు ఉండవని, సినిమా ప్రజలకు వినోదాన్ని అందించే సాధనమేనన్నారు.
సినీ పరిశ్రమలోని సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం సత్వరమే స్పందిస్తుందన్నారు.
హైదరాబాద్ లో సినీ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారన్నారు. ఏపీలో సినీ పరిశ్రమపై అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పరోక్షంగా తప్పుపట్టిన తలసాని... అక్కడి మంత్రులతో తనకు మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు.
Post a Comment